అదృష్టం,ఐశ్వర్యం,అభివృద్ధి,కీర్తిప్రతిష్టలు,గౌరవాలను అనుగ్రహించే అఖండ దైవిక వస్తువులు.
శ్రీ సాయి జ్యోతిష్య కేంద్రం
జాతక చక్రం
8, జులై 2010, గురువారం
పాదరస శివలింగం
దక్షిణ భారతదేశంలోని పలు సుప్రసిద్ధ ఆలయాల్లో పాదరసంతో తయారించిన శివలింగాలు విక్రయించబడుతున్నాయి. పాదరసంతో తయారు చేయబడిన లింగాలను ఇంటి పూజామందిరములో ఉంచి పూజలు చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
పాదరసంతో తయారు శివలింగాలు మాత్రమే కాకుండా ఇతర దేవత విగ్రహాలను ఇంటిలో ఉంచి పూజలు చేయడం ద్వారా ఆయుర్ధాయం, విద్య, వివాహ దోషాలు తొలగిపోతాయి. ఇంకా పాదరసంతో కూడిన విగ్రహాల నుంచి వెలువడే శక్తి దుష్టశక్తులను ఇంటి నుంచి తరిమికొడుతుందని విశ్వాసం. అయితే పూర్వం మంత్రతంత్రాలకు పాదరసాన్ని ఉపయోగించేవారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కానీ పాదరసం తయారైన విగ్రహాలను పూజించడం ద్వారా దుష్ట శక్తుల నుంచి కలిగే అశుభ ఫలితాలు దరిచేరవని విశ్వాసం.
ఇకపోతే.. పాదరసంతో రూపొందిన శివలింగానికి అభిషేకం చేయించిన పాలు, తేనె, కొబ్బరి నీళ్లను సేవించడం ద్వారా శరీరంలోని నరాలకు మంచిదని పురోహితులు చెబుతున్నారు. అలాగే కామసంబంధిత వ్యాధులను దూరమవుతాయి. ఇంకా పాదరసంతో కూడిన లింగాలను, ప్రతిమలను పూజించడంతో పాటు పాదరసంతో తయారు చేసిన ఉంగరాలు, చెవిపోగులు వంటివి ధరించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
అలాగే జ్యోతిష్యం ప్రకారం పాదరసం బుధగ్రహ నక్షత్రానికి తగినదంటున్నారు. అందుచేత బుధగ్రహాధిపత్యంలో జన్మించిన జాతకులు ముత్యం వంటి అరుదైన వస్తువులతో చేయబడిన పాదరస లింగాలను, విగ్రహాలను పూజించడం ద్వారా ఉపాధి అవకాశాలు, విదేశీయానం, ఆర్థికాభివృద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 వ్యాఖ్యలు:
కామెంట్ను పోస్ట్ చేయండి