శ్రీ సాయి జ్యోతిష్య కేంద్రం

శ్రీ సాయి జ్యోతిష్య కేంద్రం
శ్రీ సాయి జ్యోతిష్య కేంద్రం,PH:-9963653907,9949621214,9705934635,9705934633,9676453548.

జాతక చక్రం

29, ఏప్రిల్ 2010, గురువారం

విధ్యా ప్రాప్తి యంత్ర పిరమిడ్


విధ్యా ప్రాప్తి యంత్ర పిరమిడ్;-ఈ పిరమిడ్ లోపల చదువు కొనే వ్యక్తుల లేదా విద్యా వ్యాపారాలకు సంబందించిన వ్యక్తుల లేదా పరిశోదన చేసేవారు మరియు విద్యా భోధన చేసేవారు మరియు విద్యలో ఆటంకాలు కలుగుతున్న వారు పోటీ పరీక్షలలో విజయం కోరుకొనేవారు మరియు వ్యాపార,ఉధ్యోగాలలో మెళుకువలు తెలుసుకోవాలనే కోరిక కలిగిన వారు వారి యొక్క కలర్ పోటో గాని,బ్లాక్ &వైట్ పోటో గాని తీసుకొని పోటోలోని బొమ్మ వైపును యంత్రానికి ఆనించి ఉంచి పిరమిడ్ క్యాప్ తో మూసివేసి కనీసం 45 రోజులపాటు ఏవారు కదిలించని సురక్షిత ప్రదేశంలో ఉంచిన ఆపోటో లోని వ్యక్తులకు పాజిటివ్ ఎనర్జీ చేరుతుంది.ఈ విధంగా చేయటం వలన విధ్యార్దులలో తనంతట తాను చదువుకొవాలనే ఆసక్తి కలుగుతుంది.ఙ్ఞాపక శక్తితో పాటు పోటీతత్వంతో చదువుతారు .పరిశోదకులకు పరిశోదనా సామర్ద్యం పెరుగుతుంది.ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపార సంస్దలలోకి వచ్చిన కస్టమర్సును ఆకర్షించే విధంగా వాక్ శుద్ధి కలిగిస్తుంది.ఈ పిరమిడ్ అందరికి ఆలోచనని ,ఙ్ఞానాన్ని కలిగిస్తుంది .

28, ఏప్రిల్ 2010, బుధవారం

బ్యాంబు ట్రీ


బ్యాంబు ట్రీ:-(చైనా వెదురు చెట్టు);-ఇది మన నవగ్రహాలలో బుథ గ్రహానికి చెందినది.ఇది వ్యాపార సంస్థలలో ఉంచితే వ్యాపారం దిన దినాభివృథ్ధి చెందుతుంది.(చెట్టు పెరిగినట్టు పెరుగుతుంది.వ్యాపార సంస్థలలో నరథిష్టికి ' ఆకర్షణకు ,వ్యాపారభివృథ్థికి చాలా మంచిది .

పిల్లలు చధువు కొనే టేబుల్ దగ్గర ఉంచితే మంచి తెలివితేటలు ,చదువుపై శ్రద్ద ,సరియైన సమయంలో (పరీక్ష సమయములలో ) గుర్తుకు వచ్చే ఆలోచనలు(క్రియేటివిటి) .మంచి వాక్ ఫటిమ కలిగి భావ ప్రకటన చేయగలడు.

ఇంటిలో సింహా ద్వారానికి ఎదురుగా ఉంచితే వీథిపోటు ,నరదృష్టి ,కనుదృష్టి,చెడు ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని కలిగించి మంచి అన్యోన్నత ,ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు కలిగి ఎప్పుడు సుఖశాంతులు ,థనాభివృద్దితో ఇల్లు కళకళ లాడుతుంది .

వాహాన నియంత్రణ పిరమిడ్


వాహాన నియంత్రణ పిరమిడ్:ఈ పిరమిడ్ అన్ని వాహానాలలో ఉపయోగించుకొనవచ్చును.పిరమిడ్ లోపల ఉన్న యంత్రం మీద వాహానాన్ని నడుపుతున్న వ్యక్తి యొక్క లేదా వాహానం యొక్క ఓనర్ లేదా వారి ప్యామిలికి చెందిన కలర్ పోటో గాని ,బ్లాక్ &వైట్ పోటోగాని తీసుకొని పోటోలోని బోమ్మ వైపును యంత్రానికి ఆనించి ఉంచి పై పిరమిడ్ క్యాప్ తో మూసివేసి కనీసం 45రోజుల పాటు ఉంచిన పోటోలోని వ్యక్తులకు ఎనర్జీ వస్తుంది.ఆ వ్యక్తులు వాహానం నడిపేటప్పుడు మంచి ఏకాగ్రతతో వాహానం నడప గలరు.అంతేకాక వాహానానికి యాక్సిడెంట్సు కాకుండా కాపాడుతుంది.ఇంకా వాహానానికి ఎక్కువ రిపేర్లు రాకుండా కాపాడుతుంది.ఈ వాహాన నియంత్రణ పిరమిడ్ ఎళ్ళవేళల వాహానానికి రక్షణ కవచం లాగ పనిచేస్తుంది .

శుక్ర దోష నివారణా క్షేత్రం "తిరునావలీశ్వరాలయం


తిరునావలూరులోని తిరునావలీశ్వర ఆలయం ప్రముఖ శుక్రదోష నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శుక్రుడంతటి వాడికే శాప విమోచనం కలిగించిన క్షేత్రంగా విశ్వసించటంతో ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా అలరారుతోంది.

విల్లుపురం జిల్లాలోని తిరునావలూరులో నెలకొన్న ఈ ఆలయానికి సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది.

మొదటి పరాంతక చోళుడి కుమారుడు రాజ ఆదిత్యన్ ఈ తిరునావలీశ్వర ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయంలోని మూల విరాట్టుకు భక్త జనేశ్వరుడు, తిరునావలీశ్వరుడు అనే పేర్లు ఉన్నాయి. తమిళంలో తిరు అనేది తెలుగు శ్రీ అనే పదానికి సమానార్థకం కాగా.. నావల్ అంటే నేరేడు చెట్లు అని అర్థం.

ఈ ఆలయ ప్రాంగణంలో నేరేడు చెట్లు అధికంగా ఉండటంతో ఆ ప్రాంతానికి తిరునావలూరు అనే పేరు వచ్చినట్లు, ఊరి పేరు ప్రకారమే స్వామివారికి తిరునావలీశ్వరుడుగా పిల్చుకుంటున్నట్లు ప్రతీతి. ఆలయ స్థల వృక్షం కూడా నేరేడు చెట్టే కాగా... అమ్మవారిని సుందరనాయకి, మనోన్మణి అనే పేర్లతో భక్తులు పిలుస్తుంటారు.

మూల విరాట్టుపై సూర్య కిరణాలు:
ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ఆలయ మూల విరాట్టుపై సూర్య కిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. ఈ సుందర దృశ్యం చూసేందుకు ఆ రోజు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటుంటారు.

ఆలయ ప్రాశస్త్యం విషయానికి వస్తే... ఒకానొక సందర్భంలో మునీశ్వరుల శాపానికి గురైన శుక్రుడు తిరునావలీశ్వర ఆలయంలోని స్వామివారిని పూజించి విమోచనం పొందినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఈ ఆలయం శుక్రదోష విమోచన క్షేత్రంగా విలసిల్లుతోంది. శుక్ర దోషం ఉన్నవారు ఈ ఆలయానికి అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు.

63 మంది నయనార్లలో ఒకరైన సుందరర్ జన్మస్థలం కూడా తిరునావలూరే కావడంతో, ఆలయం ఎదురుగా ఆయనకు ఒక ప్రత్యేక సన్నిధిని నెలకొల్పారు. అప్పట్లోనే ఈ ఆలయ ప్రాశస్త్యం శ్రీలంక వరకు వ్యాప్తి చెందడంతో, అక్కడి తమిళ రాజులు తిరునావలీశ్వర ఆలయానికి విరాళాలు కూడా అందజేసినట్లు శాసనాలు చెబుతున్నాయి.

ఈ ఆలయంలో మూడుపూటలా నిత్య పూజలను నిర్వహిస్తుంటారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 గంటల నుంచి, రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరువబడి ఉంటుంది. నెలలో రెండు రోజులు ప్రదోష పూజలు.. మంగళ, శుక్ర వారాలలో అమ్మవారికి విశేష పూజలు.. ఏడాదిలో మహాశివరాత్రి లాంటి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో నవగ్రహ సన్నిధి, భైరవుడు, గురు దక్షిణామూర్తి, నయనార్లు, అమ్మవారి సన్నిధులు వేరువేరుగా ఉన్నాయి.

ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ఆలయ మూల విరాట్టుపై సూర్య కిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. ఈ సుందర దృశ్యం చూసేందుకు ఆ రోజు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటుంటారు. సాధారణంగా ఆలయాల్లో గురు దక్షిణామూర్తి స్వామివారు కూర్చున్న భంగిమలో కనిపిస్తాడు. కానీ ఈ ఆలయంలో మాత్రం నిలబడిన భంగిమలో, వృషభంపై ఓ చేయి వేసి కనిపిస్తూ ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

ఎలా వెళ్లాలంటే... తమిళనాడులోని చెన్నై నగరం నుంచి వెళ్లే భక్తులు బన్రుట్టి, విళుపురం నుంచి బస్సు మార్గంలో తిరునావలూరు వెళ్లవచ్చు. చెన్నై-తిరుచ్చి మార్గంలో సుమారు 200 కిలోమీటర్ల దూరంలోను... బన్రుట్టి నుంచి 18 కిలో మీటర్ల దూరంలోను, విళుపురం నుంచి 22 కిలోమీటర్ల దూరంలోను తిరునావలూరు ఉంటుంది.

27, ఏప్రిల్ 2010, మంగళవారం

25, ఏప్రిల్ 2010, ఆదివారం

ఉమా కోటిలింగేశ్వర స్వామి




దక్షిణ కాశీగా పిలవబడుతూ, భక్తుల చేత నిత్యపూజలందుకుంటున్న ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంతం

లో పూర్వం... ఋషులు తపస్సు చేసి, ఆ పరమశివుడి సాక్షాత్కారం పొందారట. అందుకే ఇక్కడ శివయ్య లింగరూపంలో వెలశాడని పూర్వీకుల కథనం.

చుట్టూ ఎత్తైన కొండలు, వాటి మధ్యలో జలపాతాల హోరు, కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం, ఆ కొండలపై వెలసిన ఉమా కోటిలింగేశ్వర స్వామి, వెరసి భక్తుల మదిని పులకింపజేసేదే "పుణ్యగిరి" దేవాలయం. ఇక్కడ స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలూ వైదొలగుతాయని భక్త జనులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు.

పుణ్యగిరి గురించి మరో కథనం కూడా ఉంది. అదేంటంటే... మహా భారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో, పుణ్యగిరి కొండపై గల విరాటరాజు కోటలో తలదాచుకున్నారట. ఆ సమయంలో వారు ఇక్కడ పుట్టద్వారా వచ్చే పుణ్యజలంతో స్నానమాచరించి శివుడిని పూజించేవారట.

కాబట్టి... ఇంతటి పవిత్ర స్థలంలో స్నానమాచరించి ఆ పరమశివుడిని దర్శించుకుంటే సర్వపాపాలూ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. శివరాత్రి పర్వదినాన పుణ్యగిరిలో జాగారం చేసి, ఉమా కోటిలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే నేరుగా కైలాసం ప్రాప్తిస్తుందని భక్త జనులు గట్టిగా నమ్ముతుంటారు.

ఉమా కోటిలింగేశ్వర ఆలయం వెలసిన ప్రాంతంలో కోటిలింగాలు, త్రినాథ గుహ, దార గంగమ్మ పుణ్య జలపాతాలను విశేషంగా చెప్పవచ్చు. అంతేగాకుండా... ఆలయం చుట్టూ ఎత్తయిన కొండలు, మధ్యలో జలపాతాల హోరు, అడుగడుగునా కనిపించే పచ్చగా పరచుకున్న ప్రకృతి అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

హిందూ సంప్రదాయ పండుగలతో పాటు శివరాత్రి పర్వదినాన్ని పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శివరాత్రికి తొమ్మిదిరోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. మొదటి మూడు రోజుల ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు.

ఈ ఉత్సవాలకు ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. ప్రక్క రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. శివరాత్రి ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవారు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు.

వసతి, రవాణా సౌకర్యాల విషయానికి వస్తే... విశాఖపట్నం-అరకు మధ్యలో నెలవై ఉన్న ఈ పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి ముఖ్యమైన అన్ని ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. శృంగవరపుకోట ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బస్సులో వెళ్లి అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన చేరుకోవాల్సి ఉంటుంది. నడవలేనివారు బస్టాండు నుంచి ఆటోలలో కూడా వెళ్ళవచ్చు.

పుణ్యక్షేత్రం అరసవల్లి


"ఆదిత్యుడి" పాదాలను స్పృశించే సూర్యకిరణాలు

ఉషోదయ కిరణాలతో సమస్త ప్రాణ కోటికి నూతన చైతన్యాన్ని నింపుతున్న సూర్యభగవానుడు ఆదిత్యునిగా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం అరసవల్లి. ఈ ఆలయంలో కొలువుదీరిన భాస్కర స్వామిని పూజించిన వారికి ఈతిబాధలు, సర్వదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

ఈ ఊరిని తొలుత "హర్షవల్లి" అనే వారని అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి. శ్రీ ఉషా, పద్మినీ, ఛాయాదేవి సమేతుడైన సూర్యనారాయణుడు సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం.

రెండు చేతుల్లో అభయ ముద్రలను కలిగియుండే సూర్యనారాయణుడు, నడుముకు చురిక(కత్తి)తో భక్తులకు దర్శనమిస్తాడు. ఇక గరుత్మంతుడి అన్న అయిన అనూరుడు (అంటే తొడలు లేని వాడు అని అర్ధం) సూర్యనారాయణుని రథానికి సారథిగా ఉంటాడు. అనూరుడికే అరుణుడనే మరో పేరుంది. స్వామి విగ్రహానికి ఇరు పక్కలా చత్రచామరాలతో సేవచేస్తున్న సనకసనందులు ఉంటారు.

"మహాభాస్కర క్షేత్రం"గా పిలుస్తున్న ఆ ఆలయానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని స్ధలపురాణం చెబుతోంది. ఆలయం తొలత దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణాలు చెబుతున్నాయి. గంగవంశరాజు గుణశర్మ వారసుడైన.. కళింగ రాజు దేవేంద్రవర్మ క్రీ.శ. 673 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని నిర్మించారని లభించిన శాసనాల ద్వారా తెలుస్తోంది.


16వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి నిజాం నవాబు సుబేదార్‌గా వచ్చిన షేర్ మహమ్మద్ ఖాన్ తానే ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ఒక శాసనంలో చెప్పుకున్నారు. ఆయన వద్ద ఉద్యోగిగా ఉన్న సీతారామస్వామి అనే పండితుడు మహమ్మద్ ఖాన్ దండయాత్రను ముందుగానే తెలుసుకుని, ఆలయంలో మూలవిరాట్‌ను ఒక బావిలో పడేశారట.

క్రీ.శ.1778లో ఎలమంచిలి పుల్లాజీ అనే ఆయన ఆ బావిలో మూలవిరాట్‌ను కనుగుని బయటకి తీసి ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించి, విగ్రహ ప్రతిష్ట చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత జిల్లాలోని ఆలుదు గ్రామస్తులైన వరుదు బాబ్జీ దంపతులు ఆలయ వాస్తు నిర్మాణం దెబ్బతినకుండా గర్భగుడిపై విమానాన్ని(గోపురం) పడగొట్టి దక్షిణాది పద్ధతిన కాకుండా ఓఢ్ర (ఒరిస్సా) సంప్రదాయంలో ఆలయాన్ని నిర్మించారు.

మాములు రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ, కార్తీక మాసాల్లో వచ్చే ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా "రథసప్తమి" నాడు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.

అలాగే ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ఏటా మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబర్ 1,2,3,4 తేదీల్లోనూ, స్వామివారి ధ్రువమూర్తిపై ఆదిత్యుని తొలికిరణాలు ప్రసరించే దృశ్యాన్ని వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు అరసవల్లి ఆలయానికి తరలివస్తుంటారు. స్వామివారి పాదాల మీదుగా మొదలై, శరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే ఆ మనోహరమైన దృశ్యం అద్భుతం, అపురూపమని భక్తులు అంటూ ఉంటారు.

ఇకపోతే.. అరసవల్లి క్షేత్రాన్ని స్థానికులు ఆరోగ్య క్షేత్రంగా పిలుస్తారు. ప్రత్యేకించి కంటి వ్యాధులు, బొల్లి, కుష్టు, వ్యాధులతో పాటు ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు భాస్కర స్వామిని కొలుస్తుంటారు.

అరసవల్లికి ఎలా వెళ్లాలంటే..?
శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి అనే గ్రామంలో వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు శ్రీకాకుళం పట్టణం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరం పయనించాలి. శ్రీకాకుళం నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా భక్తులు అరసవల్లికి చేరుకోవచ్చు.

ఇకపోతే.. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళానికి రైళు లేదా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. చెన్నై, కొల్‌కతా నగరాల నుంచి శ్రీకాకుళం ప్రాంతానికి ప్రత్యేక రైళ్ల రాకపోకలున్నాయి.

అదేవిధంగా హైదరాబాద్, చెన్నై, హౌరా, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, సికింద్రాబాద్‌ల నుంచి కూడా శ్రీకాకుళంకు రైళ్లు నడుస్తున్నాయి. హౌరా మెయిల్, విశాఖ ఎక్స్‌ప్రెస్, కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా శ్రీకాకుళం చేరుకుని అరసవల్లి ఆదిత్యుడిని దర్శించుకోవచ్చు.

శ్రీకృష్ణునికి సంబంధించిన వివిధ మంత్రాలు

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణునికి సంబంధించిన వివిధ మంత్రాలు మీకోసం ఇక్కడ ఇస్తున్నాం.

ఈ మంత్రాలను జపిస్తే సుఖ-శాంతులతోపాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలలో చెప్పబడి ఉంది.

** శ్రీకృష్ణ భగవానుని మూల మంత్రం :
" కృం కృష్ణాయ నమః "

ఇది శ్రీకృష్ణుని మూల మంత్రం. ఎవరైతే తమ జీవితాన్ని సుఖ-శాంతులతో గడపాలనుకుంటున్నారో అలాంటివారు ప్రాతఃకాలాన్నే నిద్రలేచి స్నానపానాదులు కావించి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే మనిషి అన్ని రకాల బాధలు, కష్ణాలనుంచి విముక్తుడౌతాడని పురాణాలు చెపుతున్నాయి.

** " ऊँ శ్రీం నమః శ్రీ కృష్ణాయ పరిపూర్ణతమాయ స్వాహా "
ఈ మంత్రాన్ని సప్తదశాక్షర మహామంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని ఐదు లక్షల సార్లు జపిస్తే ఈ మంత్రం సిద్ధిస్తుంది. జపం చేస్తూ హోమం నిర్వహించాలి. ఇలాంటి సమయంలో దశాంశ అభిషేకం, తర్పణం చేయాలని పురాణాలు సూచిస్తున్నాయి. ఎవరికైతే ఈ మంత్రం సిద్ధిస్తుందో వారికి సర్వం లభిస్తుందంటున్నాయి పురాణాలు.

** " గోవల్లభాయ స్వాహా "
ఈ మంత్రాన్ని సప్తాక్షరాల మంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని జపించే సాధకులకు అన్నిరకాల సిద్ధులు ప్రాప్తిస్తాయి.

** " గోకులనాథాయ నమః "
అష్టాక్షర శ్రీ కృష్ణ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో అతని కోరికలన్నీ ఫలిస్తాయి.

** " క్లీం గ్లౌం క్లీం శ్యామలాంగాయ నమః "
ఈ దశాక్షర శ్రీ కృష్ణ మంత్రాన్ని జపిస్తే అన్ని కోరికలు నెరవేరి అన్నిరకాల సిద్ధులు సిద్ధిస్తాయి.

** " ॐ నమో భగవతే శ్రీ గోవిందాయ "
దీనిని ద్వాదశాక్షర శ్రీ కృష్ణ మంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి ఇష్టకామ్యార్థి సిద్ధిస్తుంది.

** " ఐం క్లీం కృష్ణాయ హ్రీం గోవిందాయ శ్రీం గోపీజనవల్లభాయ స్వాహా "
ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి వాగీశత్వం ప్రాప్తిస్తుంది.

** " ॐ శ్రీం హ్రీం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీం శ్రీం శ్రీ "
ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారి బాధలు తొలగి శుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు.

** " ॐ నమో భగవతే నందపుత్రాయ ఆనందవపుషే గోపీజనవల్లభాయ స్వాహా "
ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి, వారు కోరుకున్న వస్తువులు లభిస్తాయి.

** " లీలాదండ గోపీజనసంసక్తదోర్దండ బాలరూప మేఘశ్యామ భగవన్ విష్ణో స్వాహా "
ఈ మంత్రాన్ని ఎవరైతే ఒక లక్షసార్లు జపిస్తూ నెయ్యి, చక్కెర మరియు తేనెలో నువ్వులు అక్షతలు కలిపి హోమం చేస్తుంటారో వారికి స్థిరమైన లక్ష్మి సిద్ధిస్తుంది.

** " నందపుత్రాయ శ్యామలాంగాయ బాలవపుషే కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా "
ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తూ పాలు, చక్కెరతో చేసిన పాయసం ద్వారా హోమం చేస్తారో వారి మనోభీష్టాలు నెరవేరుతాయి.

** " ॐ కృష్ణ కృష్ణ మహాకృష్ణ సర్వజ్ఞ త్వం ప్రసీద మే. రమారమణ విద్యేశ విద్యామాశు ప్రయచ్ఛ మే "
ఈ మంత్రాన్ని జపిస్తే అన్ని రకాల విద్యలు నిస్సందేహంగా ప్రాప్తిస్తాయంటున్నారు పండితులు.

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

లక్ష్మీ ఎనర్జీ పిరమిడ్ బాక్స్


లక్ష్మీ ఎనర్జీ పిరమిడ్ బాక్స్: ఈ లక్ష్మీ ఎనర్జీ పిరమిడ్ బాక్స్ లోపల ఏవ్యక్తిదయిన బ్లాక్& వైట్ పోటో గాని, కలర్ పోటో గాని ఉంచి ఆవ్యక్తికి ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది.ఇంకా గ్రహా భాదల నుండి తట్టుకొనే శక్తిని కల్పిస్తుంది .కనుదృష్టి ,నరదృష్టి మొదలయిన దృష్టి దోషాల నుండి రక్షణ కవచం లాగ పనిచేస్తుంది.

లక్ష్మీ ఎనర్జీ బాక్స్ లోపల పెట్టిన టాబ్లెట్స్ వాటి యొక్క ( యం.జి) పెరుగుతుంది. దీనిలోపల పెట్టిన కూరగాయలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.క్యాష్ బాక్స్ గా వాడుకున్నచో థనానికి సంబందించిన సమస్యలు ఉండవు .కాపర్ యంత్రాలు ఈ బాక్స్ లో 45 రోజులు ఉంచిన ఆ యంత్రాలలో శక్తి ఉత్పాదన జరుగుతుంది .

లక్ష్మీ పిరమిడ్ బాక్స్ లో పెట్టిన భూములకు సంబందించిన విలువైన డాక్యుమెంట్లు గాని, ఇంటి డాక్యుమెంట్లు గాని,షాపు, ప్యాక్టరీకి సంబందించిన డాక్యుమెంట్లు ఎల్లప్పుడు ఈ బాక్సులో ఉంచితే భూములు అథిక దరలు పలకడమే కాకుండ,షాపు, ప్యాక్టరీకి సంబందించిన అభివృద్ది బాగుంటుంది.

ఇంకా ఈ పిరమిడ్ బాక్సులో స్టోన్ రింగ్స్,జపమాలలు, ప్యామిలీపోటోలు,లాకెట్స్ ,గోల్డ్ ఐటం మొదలగు వస్తువులేకాకుండా ఈ బాక్సులో పెట్టిన ఏ వస్తువుకైన రెట్టింపు శక్తిని ఇస్తుంది .

జన్మ లగ్నం,జన్మ రాశి,నామ ప్రథమ అక్షరం ద్వారా రుధ్రాక్ష ధారణ.







చూ,చే,చో,ల,లీ,లూ,లే,లో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి ,మేష లగ్నం,మేష రాశి వారికి,మృగశిర,చిత్త్ర,థనిష్ట నక్షత్రాల వారికి "3"ముఖాల రుద్రాక్ష గాని,"1","3","5"ముఖాలు కలిగిన రుద్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును."పగడంస్టోన్"ధరించవచ్చును.

ఈ,ఊ,ఏ,ఓ,వా,వీ,వు,వే,వో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, వృషభ లగ్నం వారికి,రాశి వారికి ,భరణి,పుబ్బ ,పూర్వాషాడ నక్షత్రాల వారికి "6" ముఖాల రుధ్రాక్ష గాని, "4","6","7" ముఖాలు కలిగిన రుధ్రాక్షలు గాని కవచం లాగ థరించ వచ్చును."డైమండ్ స్టోన్"ధరించ వచ్చును.
.
కా,కి,కూ,ఖం,ఙ,ఛ,కే,కో,హా ప్రథమ నామాక్షరలు ఉన్న వారికి, మిథున లగ్నం వారికి ,రాశి వారికి ,ఆశ్లేష ,జ్యేష్ట ,రేవతి నక్షత్రాల వారికి "4" ముఖాల రుధ్రాక్ష గాని,"4',"6","7",ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచం లాగ గాని థరించ వచ్చును."ఆకుపచ్చ స్టోన్"ధరించ వచ్చును..

హి,హు,హె,హూ,డా,డి,డూ,డే,డో, ప్రథమ నామాక్ష్రాలు ఉన్న వారికి,కర్కాటక లగ్నం వారికి ,రాశి వారికి, రోహిణి,హస్తా ,శ్రవణం, నక్షత్రాల వారికి "2"ముఖాల రుధ్రాక్ష గాని ,"2","3","5", ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచంలాగ గాని ధరించ వచ్చును."ముత్యం స్టోన్"ధరించ వచ్చును.

మా,మీ,మూ,మే,మో,టా,టి,టు,టే ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి,సింహా లగ్నం వారికి,రాశి వారికి, కృత్తిక,ఉత్తర ,ఉత్తరాషాడ నక్షత్రాల వారికి "1"ముఖం గాని, "1","3","5", ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును."కెంపు స్టోన్"ధరించ వచ్చును.
.
టో,పా,పి,పూ,ష,ణ,ఢ,పె,పో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, కన్య లగ్నం వారికి,రాశి వారికి ,ఆశ్లేష,జ్యేష్ట, రేవతి,నక్షత్రాల వారికి "4"ముఖాల రుధ్రాక్ష గాని,"4","6","7",ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును."ఆకుపచ్చ స్టోన్"ధరించ వచ్చును..

రా,రి,రూ,రె,రో,తా,తీ,తూ,తే,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, తులా లగ్నం వారికి, రాశి వారికి,భరణి,పుబ్బ,పూర్వషాడ,నక్షత్రాల వారికి"6"ముఖాల రుధ్రాక్ష గాని ,"4','6","7"ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును.."డైమండ్ స్టోన్"ధరించ వచ్చును.

తో,నా,నీ,నూ,నే,నో,య,యి,యు,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, వృశ్చిక లగ్నం వారికి, రాశి వారికి, మృగశిర,చిత్త్ర,థనిష్ట నక్షత్రాల వారికి "3"ముఖాల రుధ్రాక్ష గాని,"2","3","5"ముఖాల రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును.."పగడంస్టోన్"ధరించవచ్చును. .

యే,యో,బా,బి,బు,ధ,భ,ఢ,బే,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి,థనస్సు లగ్నం వారికి, రాశి వారికి,పునర్వసు,విశాఖ,పూర్వాభాధ్ర,నక్షత్రాల వారికి "5"ముఖాల రుధ్రాక్ష గాని "1",'3","5"ముఖాల రుధ్రక్షలను కవచం లాగ థరించ వచ్చును."కనక పుష్యరాగం స్టోన్"ధరించ వచ్చును.

బో,జా,జి,జు,జే,జో,ఖా,గ,గి,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, మకర లగ్నం వారికి,రాశి వారికి,పుష్యమి,అనూరాధా,ఉత్తరాభాధ్ర నక్షత్రాల వారికి "7"ముఖాల రుధ్రాక్ష గాని,"4","6","7",ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును."నీలం స్టోన్"ధరించ వచ్చును.

గూ,గే,గో,సా,సి,సు,సే,సో,దా,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, కుంభ లగ్నం వారికి, రాశివారికి,పుష్యమి,అనూరాధా,ఉత్తరాభాధ్ర నక్షత్రాల వారికి"7"ముఖాల రుధ్రాక్ష గాని,"4","6","7"ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును."నీలం స్టోన్"ధరించ వచ్చును.

ది,దు,శ్యం,ఝ,ద,దే,దో,చా,చి,ప్రథమ నామాక్షరలు ఉన్న వారికి, మీన లగ్నం వారికి,రాశి వారికి,పునర్వసు,విశాఖ,పూర్వాభాథ్ర నక్షత్రాల వారికి"5"ముఖాల రుధ్రాక్ష గాని,"2","3","5"రుధ్రాక్షలను కవచం లాగ ధరించ వచ్చును."కనక పుష్యరాగం స్టోన్"ధరించ వచ్చును.